మహబూబాబాద్ : జిల్లాలోని నెల్లికుదుర్ మండలం చిన్న నాగారం పంచాయతీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు,బలహీన, మైనార్టీ వర్గాల సంక్షేమానికి చేస్తున్న కృషికి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
పార్టీ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడుకుంటానని అన్నారు. కలిసి కట్టుగా పార్టీ బలోపేతానికి పాటుపడాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మర్నేని వెంకన్న, ఏ.ఎం.సీ వైస్ చైర్మన్ విజయ్ యాదవ్, ఎంపీటీసీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ గిఫ్ట్ప్యాక్ల పంపిణీ
గిఫ్ట్ప్యాక్లో పంపిణీ క్రిస్మస్ పండుగ సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని ఐ.ఎం.ఎ బిల్డింగ్ లో ఎమ్మెల్యే బానోత్ శంకర్ పేదవాడికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా ప్రతిఒక్కరు చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ,వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, సీనియర్ నాయకులు మర్నేని వెంకన్న, గోగల రాజు, జన్ను మహేందర్, రాజ్ కుమార్, పాస్టర్లు, నాయకులు పాల్గొన్నారు.