తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు 60 నుంచి 70 కిలోమీటర్ల లోపలా కూడా ప్రజలు ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర పథకాలపై పొరుగు రాష్ర్టాల ప్రజలు ఏమనుకుంటున్నారు? సీఎం కేసీఆర్ ఇటీవల దేశానికి ఉచిత విద్యుత్తు హామీ ఇచ్చారు. దీని ప్రభావం ఉచిత విద్యుత్తును అనుభవించే ప్రజల కన్నా ఆ పథకం వస్తే ఎట్లా ఉంటుంది? అని కరెంట్ సమస్యలతో సతమతం అవుతున్న రైతాంగం లేదా ఇతర వర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ బృందం మధ్య మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో పలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయాల సమాహారమే ఈ కథనం.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా బాసర నుంచి బిదరెల్లి మన రాష్ట్ర సరిహద్దు చివరి గ్రామం. ఇది దాటగానే ధర్మాబాద్. ధర్మాబాద్ ఊరి పొలిమేరల్లోనే పాడి రైతు గఫూర్తో మొదలైన తెలంగాణ సంక్షేమ రాగం.. నాందేడ్ జిల్లా అంతటా వినిపించింది. తెలంగాణ తరహాలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులకు అందిం చే ఆసరా పింఛన్లు మహారాష్ట్రలో లేవు. అక్కడ ఉన్నదల్లా వృద్ధాప్య పింఛన్లే. 600 ఉన్న ఆ మొత్తాన్ని ఇటీవలే రూ.1000కి పెంచారు. ‘ఈ పింఛన్ నెలనెలా ఇవ్వటం లేదు. మూణ్ణెళ్లకోసారి.. ఆర్నెల్లకోసారి ఇస్తరు.. వాళ్లు ఇచ్చినప్పుడే తీసుకోవాలె’ అని ధర్మాబాద్ సమీపంలోని బెల్గూరి నివాసి పోశెట్టి గంగ్వార్ తెలిపారు. ఇదే అభిప్రాయాన్ని భోకర్… కిణ్వట్, సొమ్తానాలోనూ వ్యక్తంచేశారు. తెలంగాణలో అమలవుతున్న షాదీముబారక్ను మహారాష్ట్ర ప్రజలు మెచ్చుకున్నారు.
ఉచిత కరెంట్.. రైతుబంధుకు ఫిదా..
సీఎం కేసీఆర్ ఇటీవల దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్తు ఇస్తామని చేసిన ప్రకటనపైనా అక్కడి రైతుల్లో చర్చ సాగుతున్నది. కేసీఆర్ ఉచిత విద్యుత్తు అందిస్తామనే విష యం మీకెలా తెలిసింది.? అంటే ‘టీవీ న్యూస్మే దేఖా హై..ఓ తో మహత్వ్పూర్ణ్ నిర్ణయ్’ అని భోకర్కు చెందిన రైతు రామ్చరణ్ సల్లావాడ్ పేర్కొన్నారు. ‘దేశ్మే తెలంగాణ బహుత్ తేజ్సే ఆగేబడీ.. తెలంగాణ కిసాఁనోంకో సర్కార్ అచ్చా బిజీలీ (కరెంట్) దేరే.. ఏ హమారే రాజ్య్మే నహీ హై’ అని సింగల్వాడీకి చెందిన భీంరావు మావేట్కర్ అనే రైతు చెప్పారు. మహారాష్ట్రలో వ్యవసాయానికి 8 గంటలే కరెంటు ఇస్తున్నారని, అదీ మూడు విడతల్లో అందుతున్నదని రైతులు తెలిపారు. తమకు రైతుబంధు, రైతుబీమా పథకాలు లేవని అత్కూర్కు చెందిన రైతు భోజీరాం నారాయణ్ ముమ్ముడ్ చెప్పాడు.
మాకు కరెంట్తోనే పని
మాకు కరెంట్ ఉంటేనే పని. కానీ ఇక్కడ సరిగా ఉండదు. కరెంట్ ఉంటేనే వెల్డింగ్ పనులు చేసుకుంటం. కేసీఆర్ తెలంగాణల అందరికీ మేలు చేస్తున్నడు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నడు. ఫ్యాక్టరీలకు, పరిశ్రమలకు, మిల్లులకు మంచి కరెంట్ ఇస్తున్నరు. మిగతా స్కీమ్స్ కూడా బాగున్నవి.
– ఫిరోజ్ ఖాన్, కిణ్వట్
‘తెలంగాణ మే ఆమ్ జనతా కో…కిసాఁనోంకో.. బహుత్ అచ్చా స్కీమ్ చల్ రహాహై. హమారే రాజ్య్ మే ఇస్తరహా స్కీమ్ నహీహై. తెలంగాణ ముఖ్య్మంత్రి కేసీఆర్ జన్తాకీ వికాస్ కేలియే కామ్ కర్ రహాహై’ మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన గపూర్ తెలంగాణ సంక్షేమ పథకాలను కీర్తిస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయానికి ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తుకు ఆత్కూరుకు చెందిన బోజీరాం నారాయణ్ జేజేలు పలికారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు.. కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకాలపై విస్తృత చర్చ సాగుతున్నది. తమకూ ఇలాంటి పథకాలు ఉంటే బాగుండుననే కిణ్వన్కు చెందిన ఫిరోజ్ఖాన్ కండ్ల నిండా ఆశలతో అన్నారు.
తెలంగాణ రైతులు పుణ్యం చేసుకున్నరు..
దూద్గాఁవ్లో మనుమడు, మనమరాలి తో మేకలను మేపుతున్న వృద్ధురాలు సావిత్రిబాయిని పలుకరించగా ‘నా కోడలు పాము కాటుకు, నా కొడుకు కరెంట్ షాక్తో చనిపో యారు. కేసీఆర్ సర్కార్ చనిపోయిన రైతులకు రూ.5 లక్షలు ఇస్తున్నదని తెలిసి మస్తు బాధప డ్డం. వాళ్లు పుణ్యం చేసుకున్నరు. మేం పాపం చేసుకున్నం’ అని ఆవేదన వ్యక్తంచేసింది.
కల్యాణలక్ష్మి మంచిగున్నది
మాది ఆంధ్ (ఆదివాసీ గిరిజన తెగ) జాతి. తెలంగాణల కేసీఆర్ మా జాతికి బాగా చేస్తున్నడు. ఇక్కడ (మహారాష్ట్ర) ఏవీ స క్కగ ఇయ్యరు. మేము తెలంగాణల పెండ్లికి పోతే తెలిసింది. కేసీఆర్ సర్కార్ కల్యాణలక్ష్మి తెచ్చిండు. ఆడపిల్ల లగ్గానికి లక్ష రూపాయలు సర్కార్ ఇయ్యటం అంటే మాటలా అనుకున్నం. నా భర్తకు ఇక్కడ పింఛన్ కోసం రెండేండ్ల నుంచి తిరుగుతన్నం.
– సముద్రబాయి లక్ష్మణ్ తార్పే, మహిళా రైతు, దేవర్గాఁవ్
తెలంగాణలో తనఖా పడ్డట్టే
తెలంగాణ మాకు పక్కనే ఉన్నది. వాళ్లు ఇక్కడికి వస్తరు. మేం అక్కడికి పోతం. చుట్టరికాలు ఉన్నాయి. అక్కడ అందరికీ కేసీఆర్ మస్తు సౌలత్ చేస్తున్నడు. పింఛన్లు రెండు వేలు..మూడువేలు నెలనెలా తనఖా పడ్డట్టే ఇస్తరు. మాకు అట్ల ఇయ్యరు. 60 ఏండ్లు అయితే పింఛన్లు. అందరికీ రావు. కొంతమందికే వస్తయ్. ఆ వచ్చేది మూణ్ణెళ్లకు, ఆర్నెళ్లకు ఇస్తరు. మీకు కేసీఆర్ ఉన్నడు..మాకు ఇక్కడ లేడు. మరాఠ్వాడా సర్కార్తో మీ తెలంగాణ సర్కార్ను పోల్చలేం. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది.
– గఫూర్, ధర్మాబాద్ (పాడి రైతు)
బిజిలీ బహుత్ తక్లీబ్
ఇదర్ బిజిలీ (కరెంట్) బహుత్ తక్లీబ్. మగర్ తెలంగాణమే దిన్భర్ ఆతాహై. మాకు 8 గంటలు రాత్రి.. పగలు మూడు విడతలుగా ఇస్తరు. కాకపోతే రేపు ఎప్పుడు కరెంట్ వస్తదో ముందుగానే చెప్తరు. మీకు రైతుబంధు వస్తున్నది. మా దగ్గర అది లేదు. కానీ దుక్కడ్ (పంట నష్టపరిహారం..సరిగ్గా పంట పండకపోతే) ఇస్తరు. ఉధర్ తెలంగాణమే కేసీఆర్ కిసాఁనోంకో అచ్చా ఫైదా దియా జాతాహై. తెలంగాణ కిసాఁనోంకో అచ్చా ముఖ్య్మంత్రి మిలా.
– బోజీరాం నారాయణ్ ముమ్మూడ్, ఆత్కూర్ రైతు
రైతుబంధు ఇక్కడ.. కరెంట్ బాదుడు అక్కడ
నాకు ఆదిలాబాద్ జిల్లా భోథ్ మండ లం ఘన్పూర్లో రెండున్నర ఎకరాల భూ మి ఉన్నది. మహారాష్ట్ర కిణ్వట్ తాలూకాలోని ఇంజ్గాఁవ్లో 8 ఎకరాల భూమి ఉ న్నది. ఇక్కడ ఎకరాకు పది వేల చొప్పున రైతుబంధు వస్తది. ఉచిత కరెంట్ వస్తది. బో థ్ మార్కెట్ల సరుకులు అమ్ముతం. ఇంజ్గాఁవ్లో కరెంట్కు బిల్లు కట్టాలె. అక్కడ
రుణ మాఫీ కాలే.. ఇక్కడ మాఫీ అయింది.
– సంజీవ్ రాథోడ్, రెండు రాష్ర్టాల్లో రైతు
ఎంత తిరిగినా మాకు పింఛన్ రాదు
కేసీఆర్ బాగా చేస్తున్నడు. అక్కడ ఇచ్చే రెండు వేల పింఛన్తో ముసలివాళ్లు ఇల్లు ఎల్లదీసుకోవచ్చు. మాకు ఇచ్చే వెయ్యి స క్కగ ఇయ్యరు. షాదీముబారక్ సబ్సే బడా అచ్చా స్కీమ్ హై తెలంగాణమే. తెలంగాణకే తరహా.. హమారేకు హోనా ఛాయియే.
– షేక్ సలీమ్, కిణ్వట్ (సైకిల్ మీద సరుకులు అమ్మే చిరువ్యాపారి)
మా దగ్గరికి గొర్లకు వస్తలేరు..
కేసీఆర్ సర్కార్ గొల్ల కురుమలకు గొర్లు పంపిణీ చేస్తున్నప్పటి నుంచి మా దగ్గరికి గొర్లు కొనేందుకు వస్తలేరు. అప్పట్లో నిజామాబాద్, భైంసా, నిర్మల్ చాలా ప్రాంతాల నుంచి వచ్చి మా దగ్గర గొర్లు, మేకలు కొనుక్కపోయేది. ఇప్పుడు ఎక్కువ వస్తలేరు. మీ దగ్గర పింఛన్లు బాగున్నయి. ఆడపిల్ల పెండ్లి అయితే కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నడు.
– పీ దేబీకార్, మహేశ్వర్నగర్ (గొర్లకాపరి)