కోటగిరి/బాన్సువాడ, జనవరి 16: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని మహారాష్ట్రలోని దెగ్లూర్కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రశంసించారు. వచ్చే దెగ్లూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామని చెప్పారు. ఈ మేరకు.. దెగ్లూర్ మున్సిపల్ కౌన్సిలర్, పట్టణ అధ్యక్షుడు మీర్ మొయినుద్దీన్, నేతలు గులాం రసూల్, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. దెగ్లూర్లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, భారీ బహిరంగ సభ నిర్వహించి తాము పార్టీలో చేరుతామని వారు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ను కలిసిన వారిలో దెగ్లూర్ మైనార్టీ నాయకులతో పాటు బీఆర్ఎస్ కోటగిరి మండల అధ్యక్షుడు ఎజాజ్ఖాన్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ అమీద్, సలీం, బాబుఖాన్ తదితరులు ఉన్నారు.