హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు శంకరన్న దోండ్గే నేతృత్వంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు సోమవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో ఎన్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ సాలుంఖే , మాజీ ఎమ్మెల్యే సంగీత వీ థోంబరే భర్త విజయ్ థోంబరే, ముద్ఖేడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నానాసాహెబ్ జాదవ్, జెడ్పీ సభ్యుడు శివ మొహోద్, మాజీ సభాపతి సుశీల్ ఘోటే, మాజీ జెడ్పీ మెంబర్ దేవానంద్ మూలె, నాందేడ్ కార్పోరేటర్ శ్రీనివాస్ జాదవ్, శివ్ సంగ్రామ్ పార్టీ నుండి కచ్రే సహేద్, బీడ్ నుంచి అమర్ షిండే, పీఎంసీ మొతాలా జిల్లా బుల్దానా ప్రెసిడెంట్, శివ్ సంగ్రామ్ పార్టీ ప్రెసిడెంట్ పంజాబ్రావ్ దేశ్ ముఖ్, శివ్ సంగ్రామ్ పార్టీ స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ శైలేశ్ సరేట్, వైస్ ప్రెసిడెంట్ కమలాకర్ థోరట్, ఎంఎన్ఎస్ లాతూర్ జిల్లా ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ జగ్దలే, బీడ్ జిల్లా శివ్ సంగ్రామ్ పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ అర్సుల్, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ దీపక్ షిండే, లాతూర్ జిల్లా ఎన్సీపీ ప్రెసిడెంట్ ఆదిత్య దేశ్ముఖ్, బీడ్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ సోమవంశీ, లా తూర్ జెడ్పీ మెంబర్ వెంకట్రావ్ జాదవ్, ధరూర్ జిల్లా బీడ్ తాలూకా బీజేపీ ప్రెసిడెంట్ మహేష్ సోలంకే, బీడ్ జిల్లా అంబజోగయ్ తాలూకా భావ్ థానా సర్పంచ్ శివ్లింగ్యాదవ్, సామాజిక కార్యకర్తలు ఇంద్రజిత్ మోరే, ధనంజయ్ మసాల్, సిద్ధేశ్వర్ థోనగే తదితర నాయకులున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ ధోంగే తదితరులు పాల్గొన్నారు.