హైదరాబాద్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక (MLC By Election) పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 1,439 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో, మంత్రి జూపల్లి కృష్ణారవు కొల్లాపూర్లో ఓటేయనున్నారు. ఏప్రిల్ 2న ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి నవీన్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.
పార్లమెంటు ఎన్నికల ముందు ఈ ఉపఎన్నిక జరుగుతుండటంతో దీనిని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీలు తమతమ ప్రజాప్రతినిధులను శిబిరాలకు తరలించాయి. కాంగ్రెస్ శిబిరంలో ఉన్న కొం తమంది ప్రజాప్రతినిధులు తప్ప తాగి చిందులు వేయడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో అధికారం చేపట్టాక తొలి ఉపఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసే అవకాశం కనిపిస్తున్నది. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసైనా సరే గెలవాలనే ఉద్దేశంతో ఏకంగా పారిశ్రామికవేత్తను రంగంలోకి దింపింది. దీంతో ఓటుకు రూ.లక్షలు ప లుకుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాగా కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు గోవా టూర్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తప్పతాగి డ్యాన్సు లు చేస్తున్న ఈ వీడియోలపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపఎన్నిక ద్వారా ఎలాంటి సంకేతం ఇస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ మాజీ మం త్రులు, ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా అ డుగులు వేస్తున్నారు.
మహబూబ్నగర్ శాసనమండలి ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల ప్రలోభాలకు గురికాకుం డా తమ ప్రజాప్రతినిధులందరినీ బీఆర్ఎస్ నేతలు శిబిరాలకు తరలించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో అధికార పార్టీని ఎలా ఢీకొనాలి అనేదానిపై చర్చలు జరుపుతున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలకు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. దీంతో వారి పర్యవేక్షణలో ప్ర జాప్రతినిధులను ప్రలోభాలకు గురి కా కుండా అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నా రు. ఎమ్మెల్సీని గెలిపించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బహుమతిగా అందించాలని, ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు, అభ్యర్థికి మధ్య ఉన్న విభేదాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు.