మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీఎం కేసీఆర్ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గతంలో 15 రోజులకు ఒక్కసారి మంచినీళ్లు వచ్చేవి. ఇప్పుడు ప్రతిరోజు స్వచ్ఛమైన నల్లా నీళ్లు వస్తున్నాయి. మిషన్ భగీరథ అనుసంధానించడంతో మంచినీటికి కొరత లేకుండాపోయింది. ఎక్కడా లేనివిధంగా జిల్లా కేంద్రంలో 3,000 డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు కేటాయించారు. రూ.85 కోట్లతో కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును తీర్చిదిద్దుతున్నారు. రూ.90 కోట్లు వెచ్చించి పెద్దచెరువును మినీట్యాంక్ బండ్గా మార్చారు. శిల్పారామం, నెక్లెస్రోడ్డు, తీగల బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. రూ.300 కోట్లతో కొత్త సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించనున్నారు. జాతీయ రహదారికి పాలమూరు రోడ్డును అనుసంధానించి నాలుగులేన్ల రహదారిగా మార్చారు. క్లాక్టవర్ సర్కిల్ రూపురేఖలే మారిపోయాయి. మరో ఆరునెలల్లో పాలమూరు మరింత సుందరంగా తయారుకానున్నది.