యాదాద్రి భువనగిరి : యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజుఉదయం 10.25 గంటలకు ధనిష్టా నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పటిక లింగ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట ప్రతిష్ట హోమం వైభవోపేతంగా జరిగాయి.ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి పాల్గొని ఉత్సవాలను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
వేద వేద పారాయణ పురోహితులు అర్చకులు రుత్విక్ యాగ్నిక బృందం పాల్గొని ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కొనసాగే మహా పూర్ణాహుతి మహా కుంభాభిషేకం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు.