హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): పలు రాష్ర్టాల్లోని పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి సోకుతుండటంతో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోకి వ్యాధి రాకుండా అడ్డుకొనేందుకు చర్యలు తీసుకొంటున్నారు. దేశవ్యాప్తంగా 9 రాష్ర్టాల్లో ఈ వ్యాధి సోకి 27 వేలకు పైగా పశువులు మృతి చెందాయి. అయితే, ఇప్పటికైతే తెలంగాణకు ముప్పు లేదని, రాష్ట్రంలో ఈ వ్యాధిని గుర్తించలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వ్యాధి ఎకువగా వ్యాప్తిచెందిన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, జమ్ముకశ్మీర్, హర్యానా, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకు పశువుల రవాణపై నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా పశువులను కొనుగోలు చేసి తీసుకొస్తే ఆ పశువులను రాష్ట్ర సరిహద్దుల్లోనే వారం పాటు క్వారంటైన్లో ఉంచాలని నిర్ణయించారు. నిఘా కోసం ఇప్పటికే రాష్ట్ర సరిహద్దు జిల్లాలకు ఆదేశాలు జారీ చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
వ్యాధి సోకుతుందిలా:ఈగలు, దోమల ద్వారా ఈ వ్యాధి సోకుతున్నట్టు అధికారులు తెలిపారు. వ్యాధి సోకిన పశువుపై వాలిన దోమలు, ఈగలు అకడి నుంచి వైరస్ను ఇతర పశువులకు వ్యాప్తి చేస్తాయన్నారు.
లక్షణాలు:
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పశువుల్లో జ్వర లక్షణాలు కనిపిస్తే పారాసిటమాల్తో పాటు యాంటిబయాటిక్స్ వినియోగించడంతోపాటు దగ్గరలోని పశు వైద్యులకు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు. రోగనిరోధక శక్తి ఎకువగా ఉన్న పశువుల్లో 2-3 వారాల్లో వ్యాధి తగ్గుతుందని వెల్లడించారు. వ్యాధి ముదిరితే పశువులు మరణిస్తాయని పేర్కొన్నారు.
అందుబాటులోనే వ్యాక్సిన్
లంపీస్కిన్ వ్యాధి నివారణకు అవసరమైన గోట్ పాక్స్ వ్యాక్సిన్ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నది. ప్రస్తుతం 20 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని, 15 రోజుల్లో మరో 40 లక్షల డోసులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ను ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్, ఒడిశా రాష్ర్టాలకు రూ.1.75కు ఒక వ్యాక్సిన్ చొప్పున ఎగుమతి చేస్తున్నారు.
రాష్ట్రంలోకి రాకుండా నియంత్రణ చర్యలు
లంపీస్కిన్ వ్యాధి రాష్ట్రంలో ప్రవేశించకుండా చర్యలు చేపట్టాం. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కేసూ లేదు. అయినా ముందు జాగ్రత్తగా ఇతర రాష్ర్టాల నుంచి పశువుల దిగుమతిని నిషేధించాం. రైతులకు ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తున్నాం. పశువుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే పశు వైద్యులకు సమాచారం ఇవ్వాలి.
– రాంచందర్, డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ