హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): వాయమ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఒక ఆవర్తన ద్రోణి కూడా కొనసాగుతున్నదని పేర్కొన్నది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసినట్టు పేర్కొన్నది.