నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నది. ఎగువనుంచి వరద ప్రవాహం తగ్గినప్పటికీ జలాశయం ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్లోకి 73,048 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతే మొత్తంలో నదిలోకి వదిలేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.90 అడుగులు నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 312.0450 టీఎంసీలు. ఇప్పుడు 311.7462 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎడమ కాలువ ద్వారా 7518 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.