నల్లగొండ: జిల్లాలోని దామరచర్లలో లారీ దగ్ధమయింది. రసాయన పరిశ్రమకు ముడిసరుకుతో ఓ లారీ రాజస్థాన్ నుంచి తడకు వెళ్తున్నది. ఈ క్రమంలో దామరచర్ల (Damaracharla) వద్ద లారీలో షార్ట్సర్య్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్, క్లీనర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం జరిగడంతో దామరచర్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ప్రమాదానికి గురైన లారీని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.