Srisailam | శ్రీశైలం : శివుడికి ప్రీతికరమైన సోమవారం రోజు అమావాస్య కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు పోటెత్తారు. శ్రీశైలం దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. మల్లన్న, భ్రమరాంబికా దేవిలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఉచిత దర్శనానికి 6 గంటలు, అతి శీఘ్ర దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులు స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో శ్రీశైలంలోని పురవీధులు కిటకిటలాడుతున్నాయి. శివ నామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి.