హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఖాదీ అభ్యున్నతికి కేంద్రం తీసుకొన్న చర్యలు ఏమిటని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించారు. కేంద్రం చేపట్టిన ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఖాదీ’ కార్యక్రమం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉన్నదా? అని నిలదీశారు.
దీనిపై కేంద్రమంత్రి భానూ ప్రతాప్సింగ్ వర్మ సమాధానం ఇస్తూ గాంధీనగర్, కోల్కతా, షిల్లాంగ్, బెంగళూర్లో జరిగిన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఖాదీ ఏర్పాటు చేయాలని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సూచించిందని చెప్పారు. దీనికి నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) సాంకేతిక సహకారంతో రూపొందించిన డిజైన్లకు మంచి ఆదరణ లభిస్తున్నదని కేంద్రమంత్రి వెల్లడించారు.