Lok Sabha Elections | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఈ నెల మూడోవారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. ప్రస్తుత లోక్సభ బడ్జెట్ సమావేశాలు 8 లేదంటే 9న వాయిదాపడే అవకాశం ఉన్నది. ఆ వెంటనే షెడ్యూల్ ప్రకటన ఉంటుందని సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆ మేరకు కసరత్తు పూర్తిచేసిందని, కేంద్రం నుంచి సంకేతాలు అందగానే ప్రకటిస్తుందని చెప్తున్నారు.
నిజానికి ఈ నెల 18 లేదా 19నే షెడ్యూల్ విడుదలవుతుందని భావించారు. 2019లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 తర్వాతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నా రు. 17వ లోక్సభ గడువు ముగిసేలోగానే 18 వ లోక్సభ ఎన్నికలు ముగించి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని అంచనా
పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న బీజేపీ
ఈ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ పావులు కదుపుతున్నది. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొంటు న్నది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంతో దేశం మొత్తాన్ని తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీ ఎన్నికలకు వరకు అదే మంత్రాన్ని కొనసాగించాలని యోచిస్తున్నది. జనవరి 22న అయోధ్య రామాలయా న్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అక్కడ మొదలైన రామోత్సవం ఈ నెల 24 వరకు కొనసాగుతుంది.
ప్రజలను నెలపాటు రామ య్య భక్తిలో ఓలలాడేలా చేస్తున్న మోదీ ప్రభు త్వం తాజాగా సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ‘భారతరత్న’ ప్రకటించడం ద్వారా ప్రజల్లో కాస్తోకూస్తో ఉన్న వ్యతిరేకతను కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. అయోధ్యలో రామయ్య ఆలయం కోసం అద్వానీ ముం దుండి ఉద్యమాన్ని నడిపించారు. అలాంటి అద్వానీ ప్రభ మోదీ అధికారంలోకి వచ్చాక మసకబారింది.
ఆయనను కావాలనే పక్కనపెట్టారనే మరక మోదీపై ఉంది. సొంతపార్టీలో నూ ఇదే అభిప్రాయం వ్యక్తమైనా అందరూ గుంభనంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో అద్వానీకి భారతరత్న ప్రకటించి తనపై పడిన మచ్చను చెరిపేసుకోవడంతోపాటు తమకు దూరమైన వర్గాలను దగ్గరికి చేర్చుకోవాలని యోచిస్తున్నది. ఓ వైపు అయోధ్య, మరోవైపు అద్వానీ.. ఈ పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారాక ఎన్నికల షెడ్యూల్ వచ్చేలా కేం ద్రం పావులు కదిపినట్టు చెప్తున్నారు.