మహబూబ్నగర్ : ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంలో జిల్లా పోలీసు సమర్థవంతంగా పని చేస్తున్నారని జిల్లా ఎస్పీ రావిరాల వేంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల పన్నెండవ తేదీ నుంచి అమలవుతున్న లాక్ డౌన్ ప్రశాంతంగా జరగడంలో ప్రజలు చక్కగా సహకరిస్తున్నారని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా చట్టాన్ని ధిక్కరించిన వ్యక్తులను గుర్తించి, ఇప్పటివరకు జిల్లాలో మొత్తం (11,746) కేసులు నమోదు చేశామని ఎస్పీ వివరాలను వెల్లడించారు.
వీటిలో 385 కేసులు దుకాణాల యజమానులపై కాగా, మాస్కులు ధరించని వారిపై 7,288 అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనదారులపై 4,073 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మానవాళి అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మనమంతా క్రమశిక్షణ, బాధ్యాతాయుతంగా ఉంటూ మహమ్మారిపై విజయం సాదిద్దామని ఎస్పీ పిలుపునిచ్చారు.
కరోనా సెకండ్ వేవ్లో యువతనే ఎక్కువగా బాధితులుగా ఉన్నారని సర్వేలు చెప్తున్నాయని, ఈ విషయాన్ని గుర్తించి కుటుంబ పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవొద్దన్నారు.
మన ఆరోగ్యం, కుటుంబం, సమాజం మొత్తాన్ని కాపాడుకునే క్రమంలో ఎవరికివారు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని ఎస్పీ ప్రజలను కోరారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా