వాజేడు ;ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉప్పొంగుతున్నది. మూడు రోజులుగా ఛత్తీస్గఢ్తోపాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో జలకళ సంతరించుకున్నది. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతూ పాలసంద్రంలా మారి కనువిందు చేస్తున్నది. జలపాతం అందాలను వీక్షించడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సెల్ఫీలు దిగుతూ, ఈత కొడుతూ సందడి చేస్తున్నారు.