హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల పూర్వ అధ్యాపకుడు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్ తండ్రి కండ్లకుంట అళహ సింగరాచార్యులు (93) మృతి చెందారు.
అభిమానుల సందర్శనార్థం ఎల్బీనగర్ సౌత్ అండ్ పార్క్ దగ్గర సింగరాచార్యుల భౌతికకాయాన్ని ఉంచనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే ‘అధ్యాపకుడి ఆత్మకథ’ రాసిన సాహితీవేత్త అళహ సింగరాచార్యులు మృతి అధ్యాపకలోకానికి, తెలుగు సాహిత్యానికి తీరనిలోటని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. సింగరాచార్యుల కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.