Wine Shop | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల సందర్భంగా రెండురోజుల ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఈ నెల 11న (శనివారం) సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 13న ఎన్నికలు ముగిసేంత వరకు మద్యం దుకాణాలు మూసే ఉంటాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.