హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో తీసుకుంటామని 145 మంది ఉద్యోగుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపిందని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు కొనియాడారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 145 మంది ఉద్యోగులను తిరిగి సచివాలయంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో సోమవారం సచివాలయం వద్ద సం బురాలు జరుపుకున్నారు. అసోసియేషన్ ఆ ధ్వర్యంలో ఉద్యోగులు పటాకులు, బాణసంచా కాల్చి సీఎం రేవంత్రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.
145 మంది ఉద్యోగుల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి జాకబ్ తెలిపా రు. ఉద్యోగుల విభజన సమయంలో సచివాలయానికి చెందిన దాదాపు 172 మంది ఏపీ కి వెళ్లిపోయారు. గత ప్రభుత్వం వారిని తె లంగాణకు రప్పించింది. సచివాలయంలోనే తిరిగి నియమించాలన్న వారి కోరిక మేరకు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.