నారాయణపేట : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాగా, మక్తల్ మండలం సంగంబండ వద్ద చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్స్ రిజర్వాయర్కు ఎగువ ప్రాంతం నుంచి 2000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరున్నది.
దీంతో అధికారులు రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి 3,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్లో ప్రస్తుతం 2.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంకా వరద ప్రవాహం పెరుగొచ్చని అధికారులు తెలిపారు.