హుజూరాబాద్, సెప్టెంబర్ 20 : వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని స్పష్టం చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన ఎల్ఐసీ ఏజెంట్లు ఏకగ్రీవ తీర్మానం చేసి మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డికి అందజేశారు.
బుధవారం హుజూరాబాద్లోని సిటీసెంట్రల్ హాల్లో ఎల్ఐసీ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన కౌశిక్రెడ్డి మాట్లాడుతూ మూడోసారి సీఎం కేసీఆర్నేనని, ఇది వందశాతం జరిగి తీరుతుందని చెప్పారు.