కొడంగల్ : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం ఖాయమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన చండూరు, నెర్మెట గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా అందిద్దామని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలను ఎంతగానో ఆకర్శిస్తున్నాయని వెల్లడించారు. నియోజక ఓటర్లు బంగారు తెలంగాణ సారథికే ఓటు వేయడానికి ఎంతో ఉత్సాహంగా సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.