చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 11 : మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజనతండా శివారులోని వల్లూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. నాలుగుసార్లు చిరుత కనిపించడంతో చుట్టుపక్కల గ్రామస్థులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వల్లూరు అటవీ ప్రాంతం నెమలిగుట్ట ప్రాంతంలో బోన్ను ఏర్పాటుచేయడంతో శనివారం రాత్రి చిరుత చిక్కుకున్నది. ఈ విషయమై కామారం గిరిజనతండా వాసులు చిన్నశంకరంపేట పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందజేయడంతో ఎస్సై మహ్మద్ గౌస్, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.