రాజన్న సిరిసిల్ల : జిల్లాలో చిరుతపులి(Leopard) సంచారం కలకలం రేపుతున్నది. తంగళ్లపల్లి మండలంలో చిరుత వరుస దాడులకు పాల్పడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం రామన్నపల్లెలో చిరుత ఆవుదూడ(Cow calf)పై దాడిచేసి చంపి తిన్నది. గ్రామానికి చెందిన జూపల్లి శ్రీనివాస్ ఎప్పటిలాగే తన పొలం వద్ద కట్టేశాడు. కాగా, ఉదయం వెళ్లి చూడగా ఆవుదూడ పై చిరుత దాడి చేసి చంపినట్లు పేర్కొన్నాడు. ఇది ఇలా ఉండగా గతంలో కూడా పలుమార్లు చిరుత పశువులపై దాడి చేయడంతో మృతి చెందాయి. చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుకుంటున్నారు.