రాజన్న సిరిసిల్ల : జిల్లాలో చిరుత పులి ఓ ఆవుపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం గోపాలరావు పల్లెలో ఆవుపై చిరుత(Leopard attack) దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బెంద్రం బాల్ రెడ్డి తన పశువులను రోజు వారీగా గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రం వద్ద పశువుల కొట్టంలో కట్టివేశాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆవుపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. గురువారం తెల్లవారుజామున రైతు వెళ్లి చూసే సరికి ఆవు మృతి చెంది ఉండడంతో కన్నీటి పర్వాంత మయ్యాడు. చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుకుంటున్నారు.