కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని సోమిర్యాగడ్ తండాలో మేకల మందపై చిరుత దాడి చేసింది. గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. గడిచిన మూడ్రోజుల్లో మేకల మందపై చిరుత దాడిచేయడం ఇది రెండోసారి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం సమయంలో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని చెప్పారు.