హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండి రైతులు ఈ ఏడాదిలో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.
మంత్రులు అల్ల్లోల ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, సబితాఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, వీ శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, చామకూర మల్లారెడ్డి, పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తదితరులు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.