హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఎన్ 440కే వైరస్పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేసునమోదైనట్టు కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. దీనిపై చంద్రబాబుకు నోటీసులు ఇస్తామని, తర్వాత ఏడురోజుల్లో విచారణకు హాజరుకావాలని కోరతామని పేర్కొన్నారు. దర్యాప్తుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై విచారణ అధికారి తగిన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.