హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఏపీ బీఆర్ఎస్లో చేరారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారికి ఏపీ నాయకుడు మెండా కిరణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు. బీఆర్ఎస్కు ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని అన్నారు.
పార్టీలో చేరిన వారిలో అద్దంకి, గుంటూరు, పెనమలూరు, నందిగామ నియోజకవర్గాలకు చెందిన యువత జీ జయప్రకాశ్, కే రాకేశ్, ఎస్ సురేష్బాబు, ఎస్ సంగమేశ్వర్రావు, కే చినబాబు, ఆర్ రోహిత్, ఏ శ్రీనివాసరావు, జస్వంత్, విశ్వతేజ్ తదితరులు ఉన్నారు.