ఎల్బీనగర్, అక్టోబర్ 28: ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్కు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఎల్బీనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ముఖ్య నేతలంతా ఆయనకు దూరం జరిగారు. టికెట్ ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన మధుయాష్కీకి వారంతా ముఖం చాటేశారు. శనివారం ఉదయం దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలో మధుయాష్కీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుల్లో ఒక్క లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్రెడ్డి మాత్రమే హాజరవగా, మిగతా నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు.