హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): న్యాయవాదులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ బుధవారం హైకోర్టు 6వ గేటు ఎదుట న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్డెంజర్స్ లాయర్స్ డే సందర్భంగా భారత ప్రజా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నేతలు ఎం వెంకన్న, డీ సురేశ్కుమార్, లింగయ్య మాట్లాడారు. న్యాయవాదుల రక్షణకు ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ తీసుకురావాలని డిమాండ్ చేశారు.