జగిత్యాల: జగిత్యాల పట్టణంలో ఓ న్యాయవాది బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణంలోని విజయపురి కాలనీలో ఉన్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి మేకల రాజేశ్వర్ అనే న్యాయవాది ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అనారోగ్యం, ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు.