Liquor Shops | హైదరాబాద్ : రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణకు శనివారమే చివరి రోజు. నిన్నటి వరకు కేవలం 25 వేల మద్యం దరఖాస్తులే వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
బుదవారం వరకు 9,600 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 10 వేల దరఖాస్తులు వచ్చాయి.. రేపే చివరి రోజు కావడంతో.. అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రావేమో అని అధికారులు దిగులు చెందుతున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ పడిపోవడం, బిజినెస్ తగ్గిపోవడం లాంటి కారణాలు ఉన్నా కూడా వ్యాపారులు సిండికేట్లాగా ఏర్పడి పోటీ లేకుండా దరఖాస్తులు వేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది మద్యం దుకాణాల కోసం 1.31 లక్షల దరఖాస్తులు రాగా ఈసారి దారుణంగా డిమాండ్ పడిపోయింది. ఈసారి లక్ష లోపే మద్యం దరఖాస్తులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మద్యం దరఖాస్తుల కోసం అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోండి అని గతంలో దరఖాస్తు చేసుకున్న వారి ఫోన్లకు ఎక్సైజ్ శాఖ అధికారులు SMSలు పెట్టి వేడుకుంటున్నారు. గతంతో పోలిస్తే దరఖాస్తులు ఈ సారి తక్కువగా వస్తుండంతో.. మద్యం టెండర్ల కోసం దరఖాస్తులు పెంచడానికి మెసేజీలు పెట్టి మరీ తిప్పలు పడుతున్నారు అధికారులు.