ములుగు : జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. లారీ, టాటా ఏసీ వాహనాలు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ములుగు మండలం మహ్మద్ గౌస్ పల్లి స్టేజ్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల కథనం మేరకు.. లారీ, టాటా ఏసీ వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.