హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున అర్బన్ పారుల ఏర్పాటుతో గ్రీనరీ గణనీయంగా పెరిగిందని, ఇదే మాదిరిగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లోనూ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బుధవారం బీఆర్కేఆర్ భవన్లో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలి, హైదరాబాద్ మెట్రోరైల్, రేరా తదితర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ విభాగాల ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు సీఎస్కు వివరించారు. మున్సిపల్శాఖ పెండింగ్ అంశాలపై సవివరమైన నివేదిక సమర్పించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, మున్సిపల్శాఖ కమిషనర్ ఎన్ సత్యనారాయణ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.