Lakshmi Barrage | మహదేవపూర్ : లక్ష్మీ బరాజ్కు శుక్రవారం 98,550 క్యూసెక్కుల ఇన్ఫ్లో వరద రూపంలో వస్తుండగా బరాజ్లోని 84 గేట్లకు గాను 36 గేట్లు ఎత్తి 1,01,218 క్యూసెక్కుల అవుట్ఫ్లోతో వరద నీటి దిగువకు విడుదల చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ డీఈఈ సురేశ్ తెలిపారు. బరాజ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.10 టీఎంసీల నీరుందని, బరాజ్ రివర్బెడ్ నుంచి ప్రస్తుత నీటిమట్టం 9.90 మీటర్లు ఉందని ఆయన వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న లక్ష్మీ(కన్నెపల్లి) పంప్హౌస్ నుంచి వారం రోజులుగా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఒక్కో మోటర్ సాయంతో 07.02 టీఎంసీల నీటిని తరలించారు. శుక్రవారం 5 మోటర్ల ద్వారా 8,472 వేల క్యూసెక్కుల నీటిని అన్నారం బరాజ్కు తరలించారు. అలాగే కాళేశ్వరం వద్ద గోదావరి నది వరద ప్రవాహనం రెండో రోజు నిలకడగా ఉంది. 1,05,130 క్యూసెక్కులతో లక్ష్మీ బరాజ్ వైపు వెళ్తున్నాయి.