Lagcherla | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాల పోరాటం కొనసాగుతోంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న బాధితులు.. సోమవారం ఉదయం జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిశారు.
లగచర్లలో అర్ధరాత్రి సమయంలో తమపై పోలీసులు జరిపిన దాడి గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్కు బాధితులు వివరించారు. పార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే తమ వారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, లగచర్ల బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలబడింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసేందుకు లగచర్ల బాధితుల వెంట ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, ఎంపీ వద్దిరాజు, మాజీ ఎంపీ మాలోతు కవిత, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులు వెళ్లారు.
ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంకు చేరుకున్న లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు
ప్రభుత్వం, పోలీసుల దుశ్చర్యలపై ఫిర్యాదు చేయనున్న బాధిత కుటుంబాలు
వారితోపాటు మానవ హక్కుల కమిషన్ ను కలవనున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ,మాజీ ఎంపీ మలోతు కవిత,… pic.twitter.com/kb3g3Syrwt
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2024