ములుగు: ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనంలో పని చేస్తున్న కూలీ హత్యకు గురయ్యారు. పీఎస్పై పనిచేస్తున్న కూలీని దుండగులు ఇనుపరాడ్డు, సిమెంటు ఇంటుకలతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని మధ్యప్రదేశ్కు చెందిన శివాలాల్గా గుర్తించారు.
పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనుల్లో 20 కూలీలు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, వలస కూలీలను విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.