బెంగళూరు, నవంబర్ 13: కర్ణాటకలో బీజేపీపై కూలీలు పోలీస్ కేసు పెట్టారు. కెంపెగౌడ విమానాశ్రయంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించిన బెంగళూరు నిర్మాత నాదప్రభు కెంపెగౌడ విగ్రహ పనులకు తమను వినియోగించుకొని కూలి చెల్లించలేదని పేర్కొన్నారు.
రూ.500 ఇస్తామని చెప్పి పని అయిపోయాక కేవలం రూ.100 చేతిలో పెట్టారంటూ చిక్కబళ్లపూర్ జిల్లాలోని సిద్లఘట్ట పోలీస్స్టేషన్లో 40 మంది కూలీలు స్థానిక బీజేపీ నేత నందీశ్పై ఫిర్యాదు చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో విగ్రహ ఏర్పాటు కోసం కూలీలను బీజేపీ నియమించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు.