హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గురువారం ప్రమాణం చేశారు. అసెంబ్లీలోని తన చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కూసుకుంట్లచే ప్రమా ణం చేయించారు.
ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షు డు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, భాస్కర్రావు, జీవన్రెడ్డి, భూపాల్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మునుగోడు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు అసెంబ్లీ నిబంధనల పుస్తకం, ఐడెంటిటీ కార్డును నూతన ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కూసుకుంట్ల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.