కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 13: వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ఎంపిక చేసిన ఆ పార్టీ, బీ-ఫాంను మరొకరికి ఇవ్వడంపై కురుమలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కురుమ అఫీషియల్స్ అండ్ ప్రొఫెసనల్స్ అసోసియేషన్ (కోపా) నాయకులు సోమవారం కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోపా రాష్ట్ర కన్వీనర్ కడారి ఐలన్న మాట్లాడుతూ నామినేషన్ చివరి రోజు చివరి నిమిషం వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వేములవాడ నియోజకవర్గ బీజేపీ బీ ఫాంను ఇతరులకు ఇవ్వడం బాధాకరమన్నారు.