వనపర్తి టౌన్, జూలై 12: రాష్ట్రం లో రాజకీయ జగడాలు మాని రైతులకు సాగు నీటిని అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సీపీఐ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మూడు రోజు ల రాజకీయ శిక్షణ తరగతుల ముగిం పు సమావేశానికి హాజరై మాట్లాడా రు. కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి వ్యవసాయానికి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు కోరితే.. రిజర్వాయర్ కొట్టుకుపోతుందని సీఎం రేవంత్రెడ్డి అనడం సరికాదని అన్నారు. కాళేశ్వరం విషయంలో రాజకీయ నిర్ణయాలు సరికాదని, సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.