జహీరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) దేశ సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి( CPI Leader) కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా(Sangareddy District) జహీరాబాద్లో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడారు. ఆదానీ(Adani), అంబానీ(Ambani) లాంటి కార్పొరేట్ల శక్తులకు దేశ సంపదను అప్పనంగా అప్పగిస్తున్నారని ఆరోపించారు.
పెట్రోల్(Petrol), డీజిల్(Diesel), వంటగ్యాస్ ధరలు పెంచి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. బీజేపీ సర్కారు(BJP Government) ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. దేశంలో నరేంద్రమోదీ పాలనలో వైషమ్యాలు పెరిగాయని పేర్కొన్నారు. బీజేపీ కో హఠావో.. భారత్ బచావ్ నినాదంతో సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జలాలొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.