KTR | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘మీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పంపే మూటలపై ఉన్న శ్రద్ధ, మీరు ప్రజలకు ఇచ్చిన మాటలపై లేకపోవడం నయవంచన, ద్రోహం కాక మరేమిటి?’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. నమ్మి చేతిగుర్తుకు ఓటేసిన పాపానికి చేతగాని సీఎంను తెలంగాణ ప్రజల నెత్తిన రుద్ది చేతులు దులుపుకొన్నారని నిప్పులు చెరిగారు. మతిలేని ముఖ్యమంత్రి చర్యల కారణంగా వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామికవర్గం దాకా, అన్నదాతల నుంచి ఆడబిడ్డల దా కా అందరూ అరిగోసడుతున్నారని ఆవేదన వ్య క్తంచేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు అన్నీ గారడీలేనని ఏడాది పాలనలో తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని ఎద్దేవాచేశారు. ఈ మేరకు బుధవారం రాహుల్గాంధీకి కేటీఆర్ ఘాటుగా లేఖ రాశారు.
‘సరిగ్గా ఏడాది క్రితం కొలువుదీరిన మీ కాంగ్రెస్ సరారు తెలంగాణను ఆగం చేయడమే కాకుండా అస్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తున్నది. ఎన్నికల టైంలో మీరు ఊదరగొట్టిన గ్యారెంటీలన్నీ గారడీలేనని అర్థమైపోయింది. మీరు చేసిన డిక్లరేషన్ల పట్ల మీకే డెడికేషన్ లేదని రుజువైంది. గాలి మోటర్లో వచ్చి గాలిమాటలు చెప్పి ఏడాదిపాటు పత్తా లేకుండా పోయిన మీకు, మీ పార్టీకి తెలంగాణ పట్ల రవ్వంత కూడా బాధ్యత లేదని స్పష్టమైంది. తెలంగాణ సీఎం ఢిల్లీకి పంపే మూటలపై మీకున్న శ్రద్ధ, మీరు ప్రజలకు ఇచ్చిన మాటలపై లేదా?’ అని కేటీఆర్ తూర్పారబట్టారు.
‘దేశానికే వెన్నెముకైన రైతన్నకు వెన్నుపోటు పొడిచిన దుర్మార్గపు పాలన మీది. కాంగ్రెస్కు అధికారమిస్తే ఏకకాలంలో రైతులందరికీ డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట నీటిమూటే అయ్యింది. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమైతే తూతూమంత్రంగా చేసి చేతులు దులుపుకొన్నరు. అదికూడా నాలుగు విడతలుగా ఊరించి ఊరించి ఉసూరుమనిపించడంతో ఇప్పటికే దాదాపు 620 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నరు. అయినా ముఖ్యమంత్రిలో చలనం లేదు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
‘బీఆర్ఎస్ హయాంలో అప్రతిహతంగా కొనసాగిన పెట్టుబడి సాయానికి కాంగ్రెస్ రాగానే బ్రేకులు వేసింది. బీఆర్ఎస్ సిద్ధం చేసిన రైతుబంధు నిధులను ఒకసారి విడుదల చేశారే తప్ప.. ఏడాదైనా మీరు చెప్పిన రైతుభరోసా మొదలే పెట్టలేదు. వానకాలం పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి రైతాంగాన్ని నిలువునా ముంచారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా కింద 15 వేలు, రైతు కూలీలకు 12 వేల చొప్పున ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మబలికి, గద్దెనెకాక సన్నవడ్లకేనని సన్నాయి నొకులు నొకిన మీ సన్నాసి ప్రభుత్వ నిజస్వరూపాన్ని రైతులు అర్థం చేసుకున్నరు. బోనస్ మాట దేవుడెరుగు.. కనీసం పంట కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర లేక సాగు మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. విత్తనాలు, ఎరువుల కోసం మళ్లీ క్యూలైన్లో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ సరారును చూసి అన్నదాతలు అసహ్యించుకుంటున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
‘ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డలకు అరచేతిలో వైకుంఠం చూపించి నిలువునా మోసం చేశారు. అరకొరగా నడుస్తున్న ఫ్రీ బస్సు సీమ్ తప్ప మహిళలకు ఒరిగిన ప్రయోజనం ఒకటీ లేదు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 హామీకి 365 రోజులు గడిచినా మోక్షం లేదు. కానీ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మీ ఢిల్లీ పార్టీ చేసిన ప్రకటనలోని డొల్లతనాన్ని తెలంగాణ ఆడబిడ్డలు పసిగట్టేశారు. కల్యాణలక్ష్మికి తోడు తులం బంగారం ఇస్తామని మభ్యపెట్టి.. చివరికి అసలు పథకానికి కూడా ఎసరు పెట్టిన దగుల్బాజీ పాలన మీది. ఏడాదిగా కల్యాణలక్మి సాయం అందని పేద తల్లిదండ్రులు కాంగ్రెస్కు శాపనార్థాలు పెడుతున్నరు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్లను 4 వేలకు పెంచుతామని, దివ్యాంగుల పింఛన్ను 6 వేలు చేస్తామని ఇచ్చిన హామీ ఏడాదైనా అమలు చేయలేదు. ఇచ్చే పింఛన్లలో కూడా రెండు నెలలు ఎగ్గొట్టి నిరుపేదల నోటికాడి బుకను లాగేసుకున్న కాంగ్రెస్కు వారి పాపం తగలక మానదు’ అని కేటీఆర్ హెచ్చరించారు.
‘హైడ్రా పేరిట హంగామా సృష్టించి నిరుపేదలకు నిలువ నీడ కూడా లేకుండా చేసిన పాపం మీ కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట మీ లక్షన్నర కోట్ల లూటిఫికేషన్ ప్లాన్ కూడా బట్టబయలైంది. బీఆర్ఎస్ హయాంలోనే ఎస్టీపీల నిర్మాణం పూర్తయినా, ఈ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు టార్గెట్ పెట్టడం మూసీలో మీ మూటల వేటకేనని తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తరు’ అని కేటీఆర్ ఎద్దేవాచేశారు.
‘ఓ వైపు అల్లుడి ఫార్మా కంపెనీ కోసం, మరోవైపు అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం సొం త నియోజకవర్గం కొడంగల్లో సీఎం బలంవంతంగా భూములు లాకునే కుట్రను దళిత, గిరిజన ఆడబిడ్డలు ఢిల్లీ వేదికగా ఎండగట్టినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిరాలేదు. ఫార్మా విలేజీ ప్లాన్ బెడిసికొట్టిందనే కక్షతో ఇండస్ట్రియ ల్ కారిడార్ పేరిట మీ ప్రభుత్వం మరో కుతంత్రాన్ని తెరపైకి తెచ్చి పచ్చని భూముల్లో చిచ్చుపెట్టే పన్నాగాలను ప్రజలు మరోసారి తిప్పికొట్టడం ఖాయం’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
‘ఎప్పుడు చూసినా రాజ్యాంగ విలువలు వల్లెవేసే మీకు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన బావమరిదికి లబ్ధి చేకూర్చిన సీఎం రేవంత్రెడ్డిని తప్పించే దమ్ముందా? అని సూటిగా ప్రశ్నిస్తున్న. ఓవైపు సీఎంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న మీకు రాజ్యాంగాన్ని తాకే నైతిక హకు కూడా లేదని స్పష్టంగా చెప్పదలుచుకున్న. కాంగ్రెస్కు అధికారమిస్తే తెలంగాణకు అంధకారమేనని చేతల ద్వారా నిరూపించిన మీ పార్టీని చరిత్రే కాదు.. భవిష్యత్తు కూడా క్షమించదు’ అని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.
‘ఉద్యమంలో కోట్లాది మందిలో స్ఫూర్తినింపిన తెలంగాణ తల్లి దివ్య, భవ్య స్వరూపాన్ని అవమానించి, ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని రేవంత్రెడ్డి చేస్తున్నరు. ఒకప్పుడు బలిదేవత అని సోనియాగాంధీని తిట్టిపోసి, ఇప్పుడు చిల్లర పన్నాగాలకు తెరలేపిండ్రు. తలరాతలు మారుస్తానని గద్దెనెక్కి తెలంగాణ తల్లిని, తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను మార్చే కుటిల యత్నాలకు పాల్పడుతున్నరు. ఈ నీచమైన, భావదారిద్య్ర చర్యలు భవిష్యత్తులో మీ పార్టీ మెడకే చుట్టుకోవడం ఖాయమని స్పష్టమైన హెచ్చరిక చేస్తున్న.
పదేండ్ల పాలనలో మేము తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టాం తప్ప.. పనికిమాలిన ఆలోచనలు చేయలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పేర్లు మార్చలేదు. ఇందిరాగాంధీ విగ్రహాల జోలికి వెళ్లలేదు. కానీ, మనసులో విషం తప్ప మెదడులో విషయం లేని సీఎం తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను చెరిపేసే దారుణ కుట్రకు తెరలేపారు. కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను అధికార చిహ్నం నుంచి తొలగించారు. ఇప్పుడు తెలంగాణ తల్లి పేరుతో కాంగ్రెస్ తల్లిని తెలంగాణ ప్రజలపై బలవంతంగా రుద్దే కుట్ర చేశారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయం-అమరవీరుల స్తూపం మధ్య తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో తెలంగాణ సమాజం యావత్తు వ్యతిరేకించినా, మీ తండ్రి రాజీవ్గాంధీ విగ్రహాన్ని బలవంతంగా ప్రతిష్ఠింపజేశారు.
ఈ విష సంస్కృతిని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు. సీఎం రేవంత్ చేసిన ఈ నీచమైన, కుటిల చర్యలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలంగాణలో చెదరడం ఖాయం. ఇందిరా, రాజీవ్ అంటే గౌరవం ఉన్నా కేవలం రేవంత్రెడ్డి చేసిన ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రతిస్పందనగా తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన, తెలంగాణ సమాజంపైన ఉన్నది.. ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిర, రాజీవ్, ఇతర కాంగ్రెస్ నాయకుల పేరిట ఉన్న ప్రతి సంస్థకు పేరు మారుస్తం. తెలంగాణ సచివాలయం ముందు ఏర్పాటుచేసిన కాంగ్రెస్ తల్లి, రాజీవ్గాంధీ విగ్రహాలకు మీ పార్టీ కార్యాలయమైన గాంధీభవన్కు సకల మర్యాదలతో సాగనంపుతం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
మీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అటెన్షన్, డైవర్షన్ పాలిటిక్స్ను మీ ముఖ్యమంత్రి ఇకనైనా మానుకుంటే మీకే మంచిది. చేతనైతే హామీలు అమలుచేయండి, లేదంటే తెలంగాణ ప్రజల ముందు లెంపలేసుకొని క్షమాపణలు కోరండి. అంతేగాని, మేము పదేండ్ల్లలో పెంచిన రాష్ట్ర సంపదను దోచుకొని, ఘనమైన తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను చెరిపేస్తామంటే సహించేది లేదు. మళ్లీ తెలంగాణను దశాబ్దాల సంక్షోభంలోకి నెట్టివేసి చేతులు దులుపుకొంటామంటే చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. జై తెలంగాణ’ అని కేటీఆర్ హెచ్చరించారు.
‘అతి తకువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీచేసిన సరారుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ చీకటి చరిత్రను లిఖించింది. సీఎం బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్ నుంచి మొదలు.. రూ.1100 కోట్ల పౌరసరఫరాల సామ్, మంత్రి పొంగులేటి కుమారుడికి అప్పజెప్పిన కొడంగల్ లిఫ్ట్ పనుల దాకా.. అడుగడుగునా వేల కోట్ల అవినీతే తాండవించింది. ఇక మూసీ బ్యూటిఫికేషన్ పేరిట ఏకంగా లక్షన్నర కోట్లకు ముఖ్యమంత్రి రేవంత్ వేసిన సెచ్ను చూసి యావత్ సమాజం నివ్వెరపోయింది. గోదావరి జలాలను మూసీకి తరలించే అంచనాలను రూ.1,100 కోట్ల నుంచి రూ.5,500 కోట్లకు అమాంతం పెంచేయడం మీ దోపిడీకి పరాకాష్ట. ఈ సాములే తాచుపాములై మీ కాంగ్రెస్ను వెంటాడటం ఖాయమని ఘంటాపథంగా చెప్తున్న’ అని కేటీఆర్ హెచ్చరించారు.
‘అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ వేసి.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మీరిచ్చిన హామీ గంగలో కలిసిపోయింది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 12,527 మాత్రమే! అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్షరాలా 1,87,473 ఉద్యోగాలు బాకీ ఉన్నదనే విషయాన్ని తెలంగాణ యువత మరిచిపోలేదు. యువతకు ఇస్తామన్న 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఏమయ్యాయని తెలంగాణ సమాజం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నది’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
‘ఓ వైపు కూల్చివేతలే కాదు.. బూటకపు ఎన్కౌంటర్ల పేరిట కాల్చిచంపుతున్న కాంగ్రెస్ సంస్కృతిని మరోసారి తెలంగాణలో అమలుచేయడం దిగ్భ్రాంతికరం. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అన్నట్టుగా సాగుతున్న మీ పాలన తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా నిర్బంధం, సకల రంగాల్లో సంక్షోభమేనని ఈ ఏడాది పాలన రుజువుచేసింది’ అని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు.
‘కనికరం లేని ముఖ్యమంత్రి ఆదేశాలతో కాంగ్రెస్ సరారు కూల్చివేతలకు కేరాఫ్గా మారితే.. ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న తెలంగాణభవన్.. జనతాగ్యారేజీగా మారింది. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా, కన్నీళ్లొచ్చినా బాధితులు తలుపుతట్టే ఏకైక గడపగా తెలంగాణభవన్ నిలిచింది. కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ ఆటోడ్రైవర్ల నుంచి హైడ్రా, మూసీ బాధితుల వరకు అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడే రక్షణ కవచం తెలంగాణభవన్ అనే విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది’ అని కేటీఆర్ సూచించారు.