హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): లక్షలాది మంది వివరాలు సేకరించకుండానే కులగణన సర్వేను తెలంగాణలో కాంగ్రెస్ సరారు పూర్తిచేసిందని రాహుల్గాంధీ లోక్సభలో పేరొనడం పార్లమెంటును తప్పుదోవ పట్టించడమేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పదేండ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1.85 కోట్లుగా తేలిందని, రాష్ట్ర జనాభాలో ఇది 51 శాతమని స్పష్టంచేశారు. మైనారిటీ బీసీలను కూడా కలిపితే ఆ సంఖ్య 61 శాతానికి చేరిందని గుర్తుచేశారు. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ చేసిన కులగణనలో బీసీల జనాభా 1.64 కోట్లకు ఎలా తగ్గిందని, 46 శాతానికి ఎలా పడిపోయిందని ప్రశ్నించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ చూపుతున్న తప్పుడు లెకలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని తేల్చిచెప్పారు. చట్టసభలో రాహుల్ అబద్ధాలు చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు.
బీసీల గొంతుకోసిన కాంగ్రెస్
అసెంబ్లీ సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్కు లేదని తేలిపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను తుంగలో తొకి, పార్టీ పరంగా సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసమేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణలోని బీసీ సమాజం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే ఏకైక లక్ష్యంగా అబద్ధాలు ప్రచారం చేసి డిక్లరేషన్లకు గోరీ కట్టిన పాపం కాంగ్రెస్ను వెంటాడటం ఖాయమని కేటీఆర్ తేల్చిచెప్పారు.
బీసీలు తగ్గి.. అగ్రవర్ణాలు పెరగడమేంటి?
కులగణనలో దొర్లిన దారుణమైన తప్పులను సవరించాల్సిన బాధ్యతను మరిచి బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణలోని బీసీ సంఘాల నేతలు కులగణన నివేదికను చించివేసి నిరసన తెలిపాయని పేర్కొన్నారు. ఈ సర్వేతో బీసీలకు న్యాయం జరగకపోగా కాంగ్రెస్ సరారు తీవ్రమైన అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. పదేండ్లలో అగ్రవర్ణాల జనాభా పెరిగి.. బీసీల జనాభా ఎలా తగ్గిందో చెప్పాలని లేఖలో రాహుల్ను నిలదీశారు.
రాహుల్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి
వెనుకబడిన వర్గాల భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన కోటాను తప్పుల కుప్పగా తయారుచేయడం, కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న నిలువెత్తు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కులగణనలో చూపిన ఈ తప్పుడు లెకల వల్ల రానున్న రోజుల్లో ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని బీసీ బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. వాస్తవాలు గ్రహించకుండా రాహుల్గాంధీ మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసే ఈ ఫెయిల్యూర్ మాడల్ను దేశవ్యాప్తంగా అమలుచేయాలని రాహుల్ కోరడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. బీసీల జనాభాను తగ్గించి చారిత్రక తప్పిదం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలోని వెనుకబడిన వర్గాలు ఎప్పటికీ క్షమించవని కేటీఆర్ స్పష్టం చేశారు. గ్యారెంటీల పేరిట చేసిన గారడీని, డిక్లరేషన్ పేరిట చేసిన దగాను చూసిన తర్వాత వచ్చే స్థానిక ఎన్నికల్లో కాదు, ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ప్రజలను నమ్మరని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని బీసీలకు రాహుల్గాంధీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.