హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): అభయహస్తం దరఖాస్తు లు దుర్వినియోగం అవుతున్నాయని, దరఖాస్తుదారుల డాటా సైబర్ నేరగాళ్ల చేతికి అందే ప్రమాదం ఉన్నదని మీడి యా అడిగిన ప్రశ్నలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం మాటలు విని అనవసరంగా తమ డ బ్బులు పోగొట్టుకోవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
‘ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా, ఎవరైనా మీకు పింఛను లేదా ఇల్లు లేదా 6 గ్యారంటీలలో దేనినైనా ఇస్తామని కాల్ చేస్తే ఓటీపీ లేదా ఏదైనా బ్యాంక్ వివరాలను షేర్ చేయవద్దు. డిప్యూటీసీఎం భట్టి విక్రమార మా టలు విని అనవసరంగా డబ్బులు పో గొట్టుకోకండి. మీరు బీఆర్ఎస్కు ఓటు వేశారా లేదా అన్నదానితో సంబంధం లేకుండా.. సైబర్ క్రైమ్ చట్టాన్ని రూ పొందించడంలో భాగమైన వ్యక్తిగా వి జ్ఞప్తి చేస్తున్నాను. నా మాటను తీవ్రం గా పరిగణించండి, సైబర్ నేరగాళ్ల బా రిన పడకండి’ అని ఎక్స్లో కోరారు.