హైదరాబాద్, అక్టోబరు 25 (నమస్తే తెలంగాణ): యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ర్టానికి నూతన పరిశ్రమలు తీసుకొస్తున్నామని.. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే సంకల్పంతో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడను దండు మలాపూర్లో 2019లో ఏర్పాటు చేసినట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. సు మారు 35 వేల మందికి ఉపాధి అందించే ఈ పారులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పారు కూడా వస్తున్నదని, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం జరుగుతున్నదన్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన దొంతినేని చందర్రావు తన కుమారుడికి తారకరామారావు పేరు పెట్టుకొన్నానని, చిన్నారిని ఆశీర్వదించాలని కోరుతూ చేసిన ట్వీట్పై స్పందించిన మంత్రి కేటీఆర్…హ్యాపీ బర్త్డే తారకరామారావు అంటూ పోస్ట్ చేశారు.