హైదరాబాద్: తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సబ్బండవర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పారు. శ్రీ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. వారి కృషిని, పట్టుదలను, వారు పోషించిన చారిత్రక పాత్రను ప్రతిఒక్కరు స్మరించుకోవాల్సిన తరుణమిదన్నారు.
కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం ఎంతో గొప్ప విషయమని చెప్పారు. విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వ హించాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంతోపాటు, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాల సాధన కు శక్తి వంచన లేకుండా కృషి చేశామన్నారు.
శ్రీ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘన నివాళి
తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారు.
సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో
సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.సర్వాయి పాపన్న జయంతి… pic.twitter.com/wHSn4LMZek
— KTR (@KTRBRS) August 18, 2024