రాజన్న సిరిసిల్ల : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
25 లక్షల రూపాయల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, 20 లక్షల రూపాయల సీడీపీ నిధులతో నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణం, 7 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న గంభీరావుపేట రోడ్డుపై నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.