హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్కు రాష్ట్రం, రైతు ప్రయోజనాలకంటే రాజకీయాలే ముఖ్యమని మరోమారు తేలిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. మేడిగడ్డ వద్ద కాఫర్డ్యాం కట్టి, మరమ్మతులు చేసి నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.
నీటిపారుదలశాఖ ఇంజినీర్ల నివేదిక తర్వాత మరమ్మతులు చేస్తామని ఎల్అండ్టీ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చిల్లర రాజకీయం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటం అడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ను బద్నాం చేయాలన్న ఒకేఒక్క అజెండాతో కాఫర్ డ్యాం కట్టకుండా రైతులను నిండా ముంచాలని చూస్తున్నదని ఆరోపించారు. ఇంత నికృష్ట రాజకీయం ఎన్నికల్లో లాభం కోసమేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు.